
తమిళనాడు నీలగిరి జిల్లాలోని పర్వత మార్గంలో 70 అడుగుల ఎత్తు నుంచి కిందికి జారి పడి 15 ఏళ్ల ఆడ ఏనుగు మృతి చెందింది కూనూర్మెట్టుపాళయం పర్వత మార్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఏనుగు కదలలేని స్థితిలో ఓ బండరాయిపై పడి ఉంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుకు వైద్య చికిత్సలు అందించే ప్రయత్నం చేస్తుండగా అది ఊహించని విధంగా కిందికి జారుతూ కుప్పకూలిపోయింది